బాహుబలి (Baahubali) సినిమాతో పాన్ ఇండియా ప్రాజెక్టులకు బాట వేశాడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli). కానీ తాను దూరదృష్టి కలవాడిని కాదని, అత్యధిక మందికి దగ్గరయే సినిమాలు తీయడమే తాను చేయగలనని చెప్పాడు రాజమౌళి. తన అప్ కమింగ్ పీరియాడిక్ డ్రామా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ (RRR promotions) లో భాగంగా తన ఫిల్మ్ మేకింగ్ ఫిలాసఫీ గురించి చెప్పుకొచ్చాడు జక్కన్న. పాన్ ఇండియా సినిమాలనేవి భారతీయ సినిమాను మార్చే గేమ్ ఛేంజర్స్ అని అన్నాడు.
బలమైన భావోద్వేగాలుంటే ఎక్కువమంది ప్రజలు మన సినిమాను ఇష్టపడతారని నా కెరీర్ ప్రయాణంలో నేర్చుకున్నా. అదే నేనిపుడు చేస్తున్నానన్నాడు రాజమౌళి. బాహుబలి సినిమాను దేశమంతా ఎలా ఇష్టపడిందని చూసినపుడు, మానవ భావోద్వేగాల ఆధారంగా రాసుకున్న కథలను సినిమాలుగా తీస్తే..ఫలితం బాహుబలిలా ఉంటుందని తెలుసుకున్నట్టు చెప్పాడు. కొన్ని సినిమాలు (ఇతర పాన్ ఇండియా సినిమాలు) బాగా ఆడుతున్నాయి. వారి సినిమాలు సక్సెస్ఫుల్ అవుతున్నందుకు జక్కన్న చాలా సంతోషంగా ఉందన్నాడు.
అయితే ఇంత పెద్ద స్థాయిలో మార్పులెలా వచ్చాయో చెప్పేందుకు తన దగ్గర ఎలాంటి ఆధారం లేదన్నాడు జక్కన్న. మొత్తానికి బాహుబలితో భారతీయ సినిమాను ప్రపంచవ్యాప్తం చేసిన జక్కన్న ఆర్ఆర్ఆర్ తో మరో హిట్టు కొట్టడం గ్యారంటీ అని ధీమాగా ఉన్నారు మూవీ లవర్స్. ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం మార్చి 25న వరల్డ్ వైడ్గా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కాబోతుంది.