కార్తీక్రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘అథర్వ’. మహేష్ రెడ్డి దర్శకుడు. సుభాష్ నూతలపాటి నిర్మాత. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సినిమా రిలీజ్ డేట్ను అనౌన్స్ చేస్తూ శనివారం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘ఒక నేరం జరిగినప్పుడు క్లూ అనేది చాలా ముఖ్యం. సరైన ఆధారాలు లేకుండా కేసును పరిశోధించలేం. క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో కీలమైన క్లూస్ డిపార్ట్మెంట్ నేపథ్యంలో నడిచే కథ ఇది. ఈ సినిమాలో హీరో కార్తీక్రాజు బయోమెట్రిక్ ఎనలిస్ట్గా కనిపిస్తారు.
సిమ్రాన్ చౌదరి జర్నలిస్ట్గా నటిస్తున్నది. సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్గా ఆకట్టుకుంటుంది’ అన్నారు. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని కథాంశమిదని హీరో కార్తీక్ రాజు తెలిపారు. టీమ్ అంత పాషన్తో ఈ సినిమాను తెరకెక్కించామని నిర్మాత పేర్కొన్నారు.