‘కెరీర్లో ఎక్కువగా ప్రతినాయకుడి పాత్రలు చేశాను. ప్రస్తుతం నటుడిగా నా ప్రాధామ్యాలు మారాయి. కథాగమనంలో ప్రధానమైన పాత్రల్ని పోషించాలనుంది’ అని అన్నారు సీనియర్ నటుడు ఆశిష్ విద్యార్థి. ప్రతిభావంతుడైన నటుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపును దక్కించుకున్న ఆయన ‘రైటర్ పద్మభూషణ్’ చిత్రంలో ముఖ్య పాత్రను పోషించారు. ఫిబ్రవరి 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఆశిష్ విద్యార్థి మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను మధ్య తరగతి తండ్రి పాత్రలో కనిపిస్తా. అన్ని పద్దతిగా ఉండాలని కోరుకుంటూ ప్రతి రూపాయికి లెక్కకట్టే తండ్రిగా నా క్యారెక్టర్ సాగుతుంది. సినిమా ైక్లెమాక్స్ ట్విస్ట్ అదిరిపోతుంది.
నటుడిగా సుహాస్కు మంచి భవిష్యత్తు ఉంది. నాని, సుహాస్లో చాలా పోలికలు కనిపిస్తాయి. గతంలో చేసినట్లుగా విలనీ రోల్స్ కాకుండా వైవిధ్యమైన పాత్రల కోసం ఎదురుచూస్తున్నా. ప్రస్తుతం నేను నటనతో పాటు మోటివేషనల్ స్పీకర్గా ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తున్నా. అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా ట్రావెల్, ఫుడ్కు సంబంధించిన అనేక విషయాల్ని పంచుకుంటున్నా’ అని చెప్పారు.