దేశంలోనే పేరు పొందిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ జీవితం ఆధారంగా తెరకెక్కించబోతున్న సినిమాలో అమీర్ఖాన్ టైటిల్ రోల్ను పోషించబోతున్నట్లు తెలిసింది. అవినాష్ అరుణ్ దర్శకుడు. ఇండియన్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉజ్వల్ నికమ్ సంచలన కేసులను వాదించారు.
1993 ముంబయి పేలుళ్లు, గుల్షన్ కుమార్, ప్రమోద్ మహాజన్ హత్య కేసులు, 2008 ముంబయిపై దాడుల ఘటనకు సంబంధించిన కేసుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వ్యవహరించి పేరు తెచ్చుకున్నారు ఉజ్వల్ నికమ్. ఈ చిత్రాన్ని స్వీయ నిర్మాణ సంస్థ అమీర్ఖాన్ ప్రొడక్షన్స్పై తెరకెక్కించబోతున్నారు.