తమిళ హీరో ఆర్యకు ఒకదాని తర్వాత మరొక శుభవార్త అందింది. తాజాగా సార్పట్టతో హిట్ కొట్టిన ఆర్య.. తండ్రి అయ్యాడు. ఆయన భార్య, హీరోయిన్ సాయేషా సైగల్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని హీరో విశాల్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఈ వార్తను అభిమానులతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను అంకుల్ అయ్యాను.. నా సోదరుడు జమ్మీ ( ఆర్య ) తండ్రి అయ్యాడు. సాయేషా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు షూటింగ్ మధ్యలో ఉన్నా. ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నా. ఆ పాపకు దేవుడి ఆశిస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నా అంటూ విశాల్ ఎమోషనల్ అవుతూ ట్వీట్ చేశాడు. తమిళ ఇండస్ట్రీలో ఆర్య, విశాల్ ఇద్దరూ మంచి స్నేహితులు. వీరిద్దరూ కలిసి బాల దర్శకత్వంలో వచ్చిన వాడు వీడు సినిమాలో నటించారు. ఆ మధ్య ఆర్య హీరోగా వచ్చిన ఐశ్వర్యాభిమస్తు సినిమాలో గెస్ట్ అప్పిరియన్స్ ఇచ్చాడు విశాల్. ఇప్పుడు ఎనిమీ సినిమాలో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు.
అఖిల్ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సాయేషా తమిళ హీరో ఆర్యను 2019లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక ఆర్యకు కూడా తెలుగులో మార్కెట్ ఉంది. అల్లు అర్జున్ నటించిన వరుడు సినిమాలో విలన్గా నటించి మెప్పించాడు ఆర్య. ఆ సినిమా తర్వాత ఆర్యకూ తెలుగులోనూ మంచి మార్కెట్ ఏర్పడింది. ఆయన నటించిన రాజా రాణి, ఆట ఆరంభం, నేనే అంబానీ, వాడు వీడు వంటి సినిమాలు తెలుగులో డబ్ అయి మంచి విజయాన్ని అందుకున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
బ్రహ్మాజీతో జాగ్రత్తగా ఉండు.. నాగశౌర్యకు రానా సూచన
RRR సినిమా విషయంలో వివాదాలు తప్పవా?
పవర్ స్టార్తో ఆ హీరోయిన్ నాలుగో పెళ్లి.. ఫోటో వైరల్?
జూనియర్ ఎన్టీఆర్ కొత్త కారు వచ్చేసింది.. చరణ్ ఇంటి ముందు పార్కింగ్..!
త్రిష పెళ్లి టాపిక్ మళ్లీ వైరల్..ఇంతకీ ఎవరా వ్యక్తి.?
రాజ్ కుంద్ర సంస్థకు శిల్పాశెట్టి రాజీనామా