టాలీవుడ్ (Tollywood) సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) నటిస్తోన్న తాజా చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaaru Paata). పరశురాం (Parasuram) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మే 12న విడుదల కానుంది. భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాశ్ పనిచేశారు. మహేశ్ బాబు అభిమానులకు విజువల్ ట్రీట్ అందించేలా ఈ సినిమా కోసం వేసిన సెట్స్ ఉండబోతున్నాయంటున్నారు ఈయన.
ఏఎస్ ప్రకాశ్ (AS Prakash) మీడియాతో చేసిన చిట్చాట్లో పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. సెట్స్ లో మహేశ్ బాబు చాలా జోవియల్గా ఉంటాడని చెప్పాడు. ‘ నేను మహేశ్ బాబుతో చాలా కాలంగా అంటే..దూకుడు సినిమా నుంచి ప్రయాణం చేస్తున్నా. ఇది మా ఇద్దరికి ఏడో సినిమా. ఈ చిత్రంలో రెండు పాటలు పూర్తిగా సెట్స్ లోనే షూట్ చేశారు. ఈ చిత్రం కోసం మొత్తం 8 భారీ సెట్స్ వేశామని’ చెప్పారు.
బ్యాంకింగ్ వ్యవస్థ నేపథ్యంలో..
బ్యాంకింగ్ వ్యవస్థ చుట్టూ తిరిగే కథాంశంతో సర్కారు వారి పాట ఉంటుందని చెప్పారు ప్రకాశ్. ఈ సినిమా కోసం 3 బ్యాంక్లను నిర్మించామని..వీటిలో 2 బ్యాంకులు సమకాలీన వ్యవస్థలోనివి కాగా..మరొకటి 50 ఏండ్ల పురాతనమైనదన్నారు. వైజాగ్ వీధుల్లో కొన్ని సన్నివేశాలుంటాయి. అయితే వీటిని గోవాలో షూట్ చేయాలని ప్లాన్ చేశాం. కానీ ప్రాక్టికల్గా చిక్కులుండటంతో..హైదరాబాద్లోనే ఆ లొకేషన్ కు తగినట్టుగా కాలనీ సృష్టించామని చెప్పుకొచ్చారు.
సోషియో ఫాంటసీ సినిమా చేయాలి..
తనకు హై బడ్జెట్ పీరియాడిక్ సినిమాలో పనిచేసే అవకాశమొచ్చిందని, అయితే బిజీ షెడ్యూల్స్ వల్లే ఆ ఛాన్స్ మిస్సయ్యానని చెప్పారు. సోషియో ఫాంటసీ సినిమా చేయాలన్నది తన కోరిక అని అన్నారు. ప్రస్తుతం నేను చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలకు పనిచేస్తున్నా. బాలకృష్ణ-గోపీచంద్ మలినేని సినిమాతోపాటు ఎఫ్ 3, మహేశ్-త్రివిక్రమ్ సినిమా కూడా చేస్తున్నానని చెప్పుకొచ్చారు ఏఎస్ ప్రకాశ్.
మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తున్నసర్కారు వారి పాటలో కీర్తిసురేశ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఎస్ థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.