హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్గా నియమితులైన ఎంపీ సింగ్ బాధ్యతలను స్వీకరించారు. మే 31 వరకు బోర్డు చైర్మన్గా విధులు నిర్వహించిన పరమేశం ఉద్యోగ విరమణ చేయడంతో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ (జీఆర్ఎంబీ) చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్కు కేఆర్ఎంబీ చైర్మన్గా అదనపు బాధ్యతలను అప్పగించారు. కేఆర్ఎంబీ చైర్మన్గా ఎంపీ సింగ్ను నియమిస్తూ కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) జూన్ 12న ఉత్తర్వులు జారీచేసింది. బుధవారం జలసౌధలో ఆయన అయ్యర్ నుంచి పదవీబాధ్యతలను స్వీకరించారు. పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బోర్డు సభ్యులతో నూతన చైర్మన్ సమావేశాన్ని నిర్వహించారు.