స్థానికులకు అవకాశాలివ్వడం ద్వారా దక్షిణాది సినిమా మరింత అభివృద్ధి చెందే వీలుంటుందని అభిప్రాయపడ్డారు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఇటీవల చెన్నైలో జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (దక్షిణ్) కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ వేదికపై రెహమాన్ మాట్లాడుతూ…‘దక్షిణాది కంటే ఉత్తరాది సినిమాలు బాగుంటాయని, మనుషులు అందంగా ఉంటారనే అభిప్రాయం వ్యక్తం చేశాడో చైనీస్ మిత్రుడు. బహుశా అతను సౌత్ సినిమాలు చూసి ఉండడు. ఇక్కడి వారి ప్రతిభను ప్రపంచానికి చూపించాలంటే దర్శకనిర్మాతలు స్థానిక నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవకాశాలివ్వాలి. నా దృష్టిలో ఇండియాకు నార్త్ , సౌత్ అనే బేధాలు ఉం డొద్దు. భారత్ ఒక్కటే. కళ ద్వారా ప్రజల్ని ఏకం చేయాల్సిన సమయం వచ్చింది. ఆ శక్తి సినిమాలకు ఉంది. అన్నారు.