అమరావతి : జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమాపై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఈ సినిమా విషయంలో ఏపీ సీఎం వ్యవహరం ఉగ్రవాదాన్ని తలపిస్తుందని ట్విటర్లో పేర్కొన్నారు. ‘రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ సీఎం వదలడం లేదు. చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నాడని’ ఆరోపించారు. భారతి సిమెంట్పై లేని నియంత్రణ భీమ్లా నాయక్ సినిమాకెందుకుని ప్రశ్నించారు.
వ్యక్తులను టార్గెట్గా పెట్టుకుని వ్యవస్థలను నాశనం చేస్తున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని, జగన్ తన మూర్ఖపు వైఖరి వీడాలని సూచించారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న తమ వారిని రక్షించేందుకు దేశంలో అన్ని రాష్ట్రాలు ప్రయత్నం చేస్తుంటే జగన్ మాత్రం భీమ్లా నాయక్పై కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉన్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలు అన్నీ పక్కన పెట్టి థియేటర్ల దగ్గర రెవెన్యూ ఉద్యోగులను కాపలా పెట్టిన ప్రభుత్వ తీరును చంద్రబాబు తప్పుబట్టారు.