ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్లలో ఒకరు అనుపమ్ ఖేర్. సుదీర్ఘ కాలం తర్వాత కార్తికేయ 2 (Karthikeya 2) సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించారు ఈయన. కార్తికేయ 2 టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్, కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్ లో మిస్టరీ థ్రిల్లర్గా వచ్చి మంచి సక్సెస్ అందుకుంది.
ఈ సినిమా గురించి అనుపమ్ ఖేర్ (Anupam Kher) మాట్లాడుతూ..సినిమాలో తాను లార్డ్ కృష్ణ గొప్పతనాన్ని వివరించే చిన్న సన్నివేశం ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించేలా సాగుతుందని అన్నారు. కొన్నాళ్లుగా నార్త్ వర్సెస్ సౌత్ అంశంపై చర్చ నడుస్తున్న నేపథ్యంలో అనుపమ్ ఖేర్ స్పందిస్తూ..దక్షిణాదిన కథకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ సినిమాలు చేస్తుంటే…హిందీ ఫిల్మ్ మేకర్స్ మాత్రం ప్రాథమిక కథాంశంపై ఫోకస్ పెట్టకుండా యాక్టర్ల ఇమేజ్పై దృష్టి పెడుతున్నారని చెప్పుకొచ్చారు.
4 దశాబ్దాల కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న అనుపమ్ ఖేర్ ఇలాంటి వ్యాఖ్యలుచేయడం ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. మరి దీనిపై ఎలాంటి రియాక్షన్ ఉంటుందో చూడాలంటున్నారు సినీ జనాలు. ఈ ఏడాది ది కశ్మీర్ ఫైల్స్ సినిమాలో వన్ ఆఫ్ ది కీ రోల్లో నటించారు అనుపమ్ ఖేర్. ఆయన నటనకు ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపించారు.