Animal Movie | బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor), అర్జున్ రెడ్డి (Arjun Reddy) ఫేమ్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Vanga) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘యానిమల్’(Animal). ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నేడు హైదరాబాద్లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ఈవెంట్కు సంబంధించి మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు.
అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ ఈవెంట్కు రానున్న నేపథ్యంలో మేకర్స్ వారికి బ్యాడ్ న్యూస్ అందించారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మల్లా రెడ్డి యూనివర్శిటీలో చదువుతున్న విద్యార్థులకే మాత్రమే అనుమతి ఉందని బయటి వ్యక్తులకు ఎంట్రీ లేదని ప్రెస్ నోట్ విడుదల చేసింది.
ప్రియమైన అభిమానులారా.. మల్లా రెడ్డి యూనివర్శిటీలో ఈ రోజు యానిమల్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఈ ఈవెంట్లో భాగస్వామ్యం అవుతున్నందుకు మేము సంతోషిస్తున్నాము. అయితే, ఈ ఈవెంట్ యూనివర్శిటీలో చదువుతున్న విద్యార్థులకే మాత్రమే. బయటి వ్యక్తులెవరూ క్యాంపస్లోకి అనుమతించబడరు. మేము ఇది ముందే తెలియజేయాలనుకుంటున్నాము. ఈ ఈవెంట్ను మా అధికారిక ఛానెల్ల ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నమంటూ చిత్రబృందం రాసుకోచ్చింది.
🚨 Attention, fans!
The #AnimalPreReleaseEvent at Malla Reddy University is strictly for the college crowd. Regrettably, no outsiders can join, but stay tuned for updates.
Thanks a ton for your understanding!🙌
– Team @shreyasgroup | @shreyasmedia
Watch Live Here:… pic.twitter.com/6VnP8cYo52
— Shreyas Media (@shreyasgroup) November 27, 2023
మరోవైపు రాజమౌళి- మహేశ్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయితే ‘యానిమల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ మూవీకి సంబంధించి ఏదైనా అప్డేట్ ఇస్తారని మహేష్ బాబు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.