తిరువనంతపురం: కరోనా మహమ్మారి ఉధృతి ఇంకా పూర్తిగా తగ్గకపోవడంతో కేరళలో లాక్డౌన్ను మరో వారం రోజులు పొడిగించారు. ఇప్పటికే మే 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు లాక్డౌన్ అమల్లో ఉన్నది. అయినా జిల్లాల్లో పాజిటివిటీ రేటు ఇంకా తగ్గకపోవడంతో లాక్డౌన్ను మరో వారంపాటు పొడిగించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని స్వయంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు. తాజా ఉత్తర్వుల ప్రకారం మే 23 వరకు లాక్డౌన్ కొనసాగనుంది.