Ameesha Patel | బాలీవుడ్లో ఒకప్పుడు అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకుంది అమీషా పటేల్. గత కొంతకాలంగా ఆమె వ్యక్తిగత జీవితం ఒడిదుడుకులతో సాగుతున్నది. చెక్బౌన్స్ కేసులో శనివారం రాంచీలోని సివిల్ కోర్టులో లొంగిపోయింది అమీషాపటేల్. అనంతరం న్యాయస్థానం ఆమెకు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది.
ఓ సినిమా నిర్మాణం కోసం రాంచీ జిల్లాకు చెందిన అజయ్కుమార్సింగ్ దగ్గర పదేళ్ల క్రితం రెండున్నర కోట్ల రూపాయలను అప్పు తీసుకుందీ భామ. సినిమా ఆగిపోవడంతో డబ్బులు తిరిగి చెల్లించాలని అజయ్కుమార్ ఒత్తిడి తెచ్చారు. అమీషాపటేల్ ఇచ్చిన రెండు చెక్కులు బౌన్స్ కావడంతో అజయ్కుమార్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఈ ఏడాది ఏప్రిల్ 6న అమీషాపటేల్కు కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దాంతో ఆమె శనివారం రాంచీ సివిల్ కోర్టులో లొంగిపోయింది.