Pushpa-2 | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందించిన పుష్ప-2 విడుదలకు సిద్ధమైంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్నది. ఇటీవల విడుదలైన టీజర్కు భారీ స్పందన లభించింది. పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా వైల్డ్ ఫైర్.. నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్ అంటూ అల్లూ అర్జున్ చెప్పిన డైలాగ్స్ అందరినీ అలరించాయి. ఇక పుష్ప ద రైజ్ బాక్సాఫీస్ వద్ద ఎంత హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీతో అల్లు అర్జున్కు పాన్ ఇండియా స్టార్ హోదా అందుకోవడంతో పాటు జాతీయ ఉత్తమ అవార్డుని అందుకున్నాడు. ఈ క్రమంలో పుష్ప-2పై భారీ అంచనాలున్నాయి. ఇక ఈ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.
టీజర్ విడుదలైన ఒక రోజులేనే 100 మిలియన్స్ వ్యూస్ వచ్చిందంటే మూవీకి ఎంత క్రేజ్ ఉందో తెలుస్తుంది. డిసెంబర్ 5న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీలో విడుదల కానున్నది. రికార్డు స్థాయిలో థియేటర్స్లో మూవీ విడుదల కానుండగా.. టికెట్ ధరలను భారీగా పెంచనున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినిమా టికెట్లను భారీగా పెంచుకునేందుకు అవకాశం ఇస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన కల్కి, దేవర మూవీలకు టికెట్ల ధరలను పెంచుకోవడంతో పాటు అదనపు షోలను వేసుకునేందుకు అనుమతి ఇచ్చాయి. ఈ క్రమంలోనే పుష్ప-2 టికెట్ల ధరలను సైతం పెద్ద ఎత్తున పెంచనున్నట్లు తెలుస్తున్నది.
ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం ప్రభాస్ కల్కి, ఎన్టీఆర్ దేవర సినిమా విడుదల సందర్భంగా సింగిల్ స్క్రీన్ టికెట్లను రూ.250 వరకు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది. తాగా పుష్ప-2 క్రేజ్ నేపథ్యంలో మేకర్స్ సింగిల్ స్క్రీన్లో టికెట్ ధరను రూ.300 వరకు పెంచుకునేందుకు ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలుస్తున్నది. సింగిల్ స్క్రీన్లోనే ఇంత భారీగా టికెట్ల రేట్లను పెంచితే.. మల్టిప్లెక్స్ ధర ఎంత ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, మేకర్స్ కోరికకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? లేదా? వేచి చూడాల్సిందే. సినిమాకున్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు రాబట్టాలని మేకర్స్ భావిస్తున్నట్లుగా తెలుస్తున్నది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ వై నిర్మిస్తున్నారు. ఇక మూవీలో హీరోయిన్గా నేషనల్ క్రష్ రష్మిక నటిస్తుండగా.. ఫహాద్ ఫాజిల్, సునీల్, రావు రమేశ్, అనసూయ భరద్వాజ్ తదితరుల కీలకపాత్రల్లో నటిస్తున్నారు.