అగ్ర హీరో అల్లు అర్జున్ గారాల తనయ అల్లు అర్హ వెండితెరపై అరంగేట్రం చేయబోతున్నది. సమంత కథానాయికగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ ద్వారా అల్లు అర్హ బాలనటిగా పరిచయంకానుంది. ఈ సినిమాలో బేబి అర్హ యువరాజు భరతుడి పాత్రలో నటిస్తోంది. గురువారం అర్హ సినిమా షూటింగ్లో పాల్గొన్నది. పదిరోజుల్లో చిన్నారి అర్హపై షూటింగ్ పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. సోషల్మీడియాలో తన అల్లరి చేష్టలతో అందరిని ఆకట్టుకునే అర్హ వెండితెరపై కనిపించనుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేవ్మోహన్, అతిథి బాలన్ తదిరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శేఖర్ వి జోసెఫ్, సంగీతం: మణిశర్మ, మాటలు: గుణశేఖర్, సాయిమాధవ్ బుర్రా, నిర్మాతలు: నీలిమా గుణ, హర్షితారెడ్డి, దర్శకత్వం: గుణశేఖర్.