Allu Arjun | సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో టాలీవుడ్ యాక్టర్ అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో వర్చువల్గా విచారణకు హాజరయ్యాడు. కాగా సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణ జూలై 6కు వాయిదా పడ్డది. అల్లు అర్జున్ విచారణకు హాజరుకాకపోవడంతో మెమో దాఖలు చేయాలని అతని తరపు న్యాయవాదికి కోర్టు సూచించింది.
ముంబైలో మూవీ షూటింగ్లో ఉన్నందున వర్చువల్ విచారణకు అనుమతించాలని అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. జూలై 6న కూడా అల్లు అర్జున్ వర్చువల్ విచారణకు హాజరవుతాడని అతని తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. విచారణలో భాగంగా ఇప్పటికే 12 మంది నిందితులు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు.
‘పుష్ప-2: ది రూల్’ స్పెషల్ ప్రీమియర్ సందర్భంగా చోటుచేసుకున్న విషాద ఘటనకు సంబంధించిన కేసును విచారిస్తున్న హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టు అల్లు అర్జున్కు సమన్లు జారీ చేయగా, జూన్ 22న వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశాలు ఇవ్వడంతో అయితే పలు షూటింగ్స్తో బిజీగా ఉన్నబన్నీవ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని బన్నీ కోర్టుని కోరినట్టు తెలుస్తోంది. మరోవైపు కేసుకి సంబంధించిన మిగతా వారంతా హాజరై బాండ్లపై సంతకాలు చేశారు. ఈ క్రమంలో కేసుని విచారించిన న్యాయమూర్తి జూలై 6కి వాయిదా వేశారు.