అల్లు అర్జున్ కొద్ది రోజులుగా పుష్ప షూటింగ్తో బిజీగా ఉన్నవిషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కరోనా వలన వాయిదా పడుతూ వచ్చింది. డిసెంబర్ 25న పుష్ప: ది రైజ్ చిత్రం విడుదల చేయనున్నారు. రీసెంట్గా చిత్ర షెడ్యూల్ మారేడుమిల్లి, కాకినాడ ప్రాంతాలలో జరపగా, ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుగుతున్నట్టు సమాచారం.
అయితే ఈ టైట్ షెడ్యూల్ నుంచి చిన్న గ్యాప్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలసి దుబాయ్ లో ఉన్నాడు. బన్నీ తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్లో దిగిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కరోనా వలన పెద్దగా టూర్స్ వేయలేకపోయిన బన్నీ ఇప్పుడు తనకు దొరికిన సమయంలో భార్యా పిల్లలతో కలిసి దుబాయ్ లో సంతోషంగా గడుపుతున్నారు.
అల వైకుంఠపురములో చిత్రం తర్వాత అల్లు అర్జున్ పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బన్నీ ఐకాన్ అనే సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత పలువురు దర్శకులతోవరుస సినిమాలు చేసేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం బన్నీ చేస్తున్న పుష్ప చిత్రం శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతుంది.ఇందులో లారీడ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో కనిపించనున్నాడు.