Akshay Kumar | బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘వెల్కమ్ టు ది జంగిల్’ (వెల్కమ్ 3) చిత్రం ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నట్లు తెలుస్తుంది. తాజాగా అందిన మీడియా నివేదికల ప్రకారం.. ఈ చిత్రంకి సంబంధించి నిధుల కొరత, నటీనటులు, సిబ్బందికి చెల్లింపులు పెండింగ్లో ఉండటంతో షూటింగ్ నిలిచిపోయినట్లు సమాచారం.
డిసెంబర్ 2023లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్, ఆగస్టు 2024లో చివరి షెడ్యూల్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ తర్వాత మళ్లీ దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. మరోవైపు ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉండడంతో చిత్ర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ ప్రాజెక్ట్లో అక్షయ్ కుమార్ 80% వాటాను కలిగి ఉండగా, నిర్మాత ఫిరోజ్ నదియాడ్వాలా మరియు ఇతరులు మిగిలిన 20% కలిగి ఉన్నారు. అయితే, నదియాడ్వాలా ఇప్పటివరకు ఈ సమస్యలపై ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదు. మరోవైపు ఈ చిత్రం 2025 చివరిలో విడుదల కావాల్సి ఉంది.
Read More