బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్కుమార్ తాజా చిత్రం ‘మిషన్ రాణిగంజ్’ ఫస్ట్లుక్ను గురువారం విడుదల చేశారు. టినూ సురేష్ దేశాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బొగ్గు గనుల నేపథ్య కథాంశంతో తెరకెక్కించారు. 1989లో రాణిగంజ్ బొగ్గు గని ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మరణించారు. సుదీర్ఘ ఆపరేషన్ ద్వారా అందులోని కార్మికులను ప్రభుత్వం రక్షించింది.
ఈ యథార్ఘ సంఘటన నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కార్మికులను కాపాడిన మైనింగ్ ఇంజనీర్ జస్వంత్సింగ్ గిల్ పాత్రను అక్షయ్ కుమార్ పోషించారు. రాణి గంజ్ బొగ్గు గని ప్రమాదం ఆధారంగా సింగరేణి నేపథ్యంలో తెలుగులో ‘నిప్పురవ్వ’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే ఘటన ఆధారంగా ‘మిషన్ రాణిగంజ్’ సినిమాను తెరకెక్కించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.