ముంబై : నిజజీవితంలో జరిగిన ఘటనలు, క్యారెక్టర్ల నుంచి స్ఫూర్తి పొందుతూ సినిమాలు తీసేందుకు ఆసక్తి కనబరిచే వారిలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) ముందువరుసలో ఉంటాడు. ప్యాడ్మన్, కేసరి, ఎయిర్లిఫ్ట్, బెల్బాటం, రుస్తుం, గోల్డ్ వంటి సినిమాలు ఇదే కోవకు చెందుతాయి.
నిజజీవితంలో గుర్తింపుకు నోచుకోని రియల్ హీరో జస్వంత్ సింగ్ గిల్ పాత్రలో అక్షయ్ కుమార్ నటించిన మిషన్ రాణిగంజ్ : ది గ్రేట్ భారత్ రెస్క్యూ కూడా ఖిలాడీ అభిరుచికి తగ్గట్టు రూపొంది ఇటీవల విడుదలై ప్రేక్షకాదారణ పొందింది. నిజజీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కే సినిమాల్లో నటించడం తనకు ఎంతో ఇష్టమని శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో అక్షయ్ కుమార్ వెల్లడించాడు.
ఈ తరహా సినిమాలు సమాజంపై ప్రభావం చూపుతాయని అన్నారు. టినూ సురేష్ దేశాయ్ నిర్ధేశకత్వంలో రూపొందిన మిషన్ రాణీగంజ్ను వాసు భగ్నానీ, జాకీ భగ్నానీ, దీప్సిక దేశ్ముఖ్,అజయ్ కపూర్లు సంయుక్తంగా నిర్మించారు. మిషన్ రాణీగంజ్ మూవీ తన బెస్ట్ సినిమాల్లో ఒకటని అక్షయ్ కుమార్ అన్నారు.
Read More :
Hi Nanna | నాలాగే ప్రతీ తండ్రికి ఈ పాట నచ్చుతుంది.. హాయ్ నాన్న గాజు బొమ్మ సాంగ్పై మహేశ్ బాబు