Akkineni Nagarjuna | టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగార్జున కుటుంబం గురించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నాంపల్లి ప్రత్యేక కోర్టులో నాగార్జున పరువు నష్టం దావా వేశాడని తెలిసిందే. అయితే చాలా రోజులుగా కొనసాగుతున్న మంత్రి కొండా సురేఖ-నాగార్జున ఫ్యామిలీ వివాదానికి ఫైనల్గా పుల్స్టాప్ పడింది. పరువు నష్టం దావాకు సంబంధించి నాంపల్లి ప్రత్యేక కోర్టులో నేడు విచారణ జరుగనున్న నేపథ్యంలో నాగార్జున కేసు విత్డ్రా చేసుకున్నాడు.
కోర్డులో విచారణకు ఒక రోజు ముందే అర్థరాత్రి మంత్రి కొండా సురేఖ నాగార్జునకు క్షమాపణలు చెబుతూ సోషల్మీడియాలో ఒక పోస్టు పెడుతూ.. గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నాంపల్లి కోర్టులోని పరువు నష్టం దావా కేసును నాగార్జున విత్ డ్రా చేసుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య నెలకొన్న వివాదానికి శుభం కార్డు పడింది.

Ram Gopal Varma | చాలా కాలం తర్వాత నిజమైన రాంచరణ్ను చూశా.. చికిరి చికిరి సాంగ్పై రాంగోపాల్ వర్మ