తిరుమల : తిరుమలలో ఈరోజు ఉదయం శ్రీవారిని సినీ నటుడు అక్కినేని నాగార్జున, ఆయన సతీమణి అక్కినేని అమల స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. నాగార్జున దంపతులను ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. కొవిడ్ కారణంగా రెండు సంవత్సరాలు స్వామి వారిని దర్శించుకో లేక పోయామని, ఆరోజు స్వామి వారి ఆశీస్సులు పొందామని పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రపంచ ప్రజలందరికి అందరికి మంచి జరగాలని ప్రార్ధించినట్లు ఆయన చెప్పారు.