బాలకృష్ణ- బోయపాటి శీను కాంబినేషన్ అంటే అభిమానులలో ఎన్ని అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాలు ఒకదానికి మించి ఒకటి హిట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి ‘అఖండ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ బాక్సఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ మూవీని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా చేసింది. శ్రీకాంత్ నెగెటివ్ రోల్ చేశాడు. ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.
విడుదలైన మొదటి ఆట నుంచే సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది ఈ చిత్రం.. ఇప్పటికే 2021లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా అఖండ చరిత్ర సృష్టించింది. అఖండకు తెలుగు రాష్ట్రాల్లో నాలుగో రోజు మరింత రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 2.95 కోట్లు, సీడెడ్లో రూ. 2.03 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 87 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 57 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 42 లక్షలు, గుంటూరులో రూ. 55 లక్షలు, కృష్ణాలో రూ. 62 లక్షలు, నెల్లూరులో రూ. 30 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 8.31 కోట్లు షేర్, రూ. 13.80 కోట్లు గ్రాస్ వచ్చింది
మంచి కలెక్షన్స్తో దూసుకుపోతున్న ఈ సినిమా పైన ఇప్పుడు బాలీవుడ్ కన్నుపడింది. ఈ సినిమాని అక్కడ రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత సాజిద్ నడియాడ్ వాలా హిందీలో రీమేక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అన్ని పక్కగా కుదిరితే అక్షయ్ కుమార్ లేదా అజయ్ దేవగన్ అఖండ హిందీ రీమేక్ లో నటించే ఛాన్స్ ఉంది అని అంటున్నారు.