ప్రేక్షకులపై ఆర్థిక భారాన్ని తగ్గించి వారిని థియేటర్లకు రప్పించే ఉద్దేశ్యంతో నిర్మాతలు టికెట్ రేట్లు తగ్గించేందుకు ముందుకొస్తున్నారు. తాజాగా ‘మేజర్’ చిత్రానికి అందరికి అందుబాటులో ఉండేలా టికెట్ రేట్లను నిర్ణయించామని నిర్మాతలు ప్రకటించారు. అడివి శేష్ కథానాయకుడిగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జూన్ 3న విడుదల కానుంది. ఈ చిత్రానికి తెలంగాణలోని సింగిల్ స్క్రీన్స్లో టికెట్ ధర 150కాగా, ఆంధ్రప్రదేశ్లో 147, మల్టీఫ్లెక్స్లలో 195, 177 ధరలు ఉంటాయని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రాన్ని మహేష్బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్తో కలిసి సోనీ పిక్చర్స్ ఇండియా నిర్మించింది. 26/11 దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.