బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అఖండ’. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యాజైస్వాల్ కథానాయిక. ఈ చిత్రంలోని ‘అడిగా అడిగా’ అనే గీతాన్ని శనివారం విడుదలచేశారు. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటను ఎస్పీ చరణ్, ఎం.ఎల్. శృతి ఆలపించారు. కల్యాణ్ చక్రవర్తి సాహిత్యాన్ని అందించారు. శ్రావ్యమైన బాణీలతో శ్రోతల్ని ఈ గీతం ఆకట్టుకుంటున్నది. నిర్మాతలు మాట్లాడుతూ ‘పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. బాలకృష్ణ పాత్ర భిన్న పార్శాల్లో సాగుతుంది. ఆయన నుంచి అభిమానులు ఆశించే అన్ని హంగులుంటాయి’ అని తెలిపారు. జగపతిబాబు, శ్రీకాంత్ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: సి.రాంప్రసాద్.