Adivi sesh | ముందు నుంచి విభిన్న పాత్రలు ఎంచుకుంటూ ఒక్కో సినిమాతో తన మార్కెట్ను పెంచుకుంటున్నాడు అడవి శేష్. ఈయన నుంచి సినిమా వస్తుందంటే కచ్చితంగా అది హిట్ అనే నమ్మకానికి వచ్చేశారు. అంతలా అభిమానుల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదట్లో పంజా, బాహుబలి, బలుపు లాంటి సినిమాల్లో ప్రతినాయక పాత్రలు వేసినా కూడా ఇప్పుడు లీడింగ్ హీరోగా మారిపోయాడు. సెన్సేషనల్ ప్రాజెక్టులను సెట్ చేశాడు.
ఇప్పటికే క్షణం, గూఢచారి, ఎవరు లాంటి విజయాలతో అడవి శేష్ తన మార్కెట్ను భారీగానే పెంచుకున్నాడు. ఇప్పుడు మరో మూడు సినిమాలను లైన్లో పెట్టాడు ఈయన. అందులో మేజర్ అన్నింటికంటే ముందుంది. మహేష్ బాబు ఈ సినిమాను నిర్మిస్తుండటం గమనార్హం. గూఢచారి సినిమా దర్శకుడు శశికిరణ్ తిక్కా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియన్ ప్రాజెక్టుగా మేజర్ వస్తుంది. మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా వస్తుంది. మరోవైపు గూఢచారి 2 సినిమాలో కూడా నటిస్తున్నాడు అడవి శేష్. ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిస్తున్నాడు ఈయన. దీనికి స్క్రిప్ట్ కూడా శేష్ అందిస్తున్నాడు.
ఈ మధ్యే నాని నిర్మాతగా హిట్ 2 సినిమాను కూడా మొదలు పెట్టాడు అడవి శేష్. ఇందులో పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నాడు. ఇది కూడా పాన్ ఇండియన్ స్థాయిలో చేయాలని చూస్తున్నాడు నాని. ఏదేమైనా కూడా ఈ మూడు సినిమాలతో అడవి శేష్ మార్కెట్ కనీసం రూ. 30 నుంచి 40 కోట్ల వరకు చేరుతుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. కచ్చితంగా రాబోయే రోజుల్లో అడవి శేష్ తన రేంజ్ మరింత పెంచుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఆస్పత్రిలో కత్తి మహేశ్ .. చికిత్సకు ఏపీ సీఎం జగన్ భారీ ఆర్థికసాయం
సునీతపై అసభ్యకరమైన పోస్ట్.. స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన సింగర్
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
నాలో మూడు మార్పులొచ్చాయి : సమంత
టాలీవుడ్ టాక్..మేం కూడా వారసులమే అంటున్న కూతుళ్లు..!
ఆఫర్ల కోసం చూస్తున్న మాధురీదీక్షిత్..!