మానవాళికి పచ్చని ప్రకృతిని అందించేందుకు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమం ’గ్రీన్ ఇండియా చాలెంజ్’. ఐదేళ్లుగా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్న ఈ కార్యక్రమంలో సినీ తారలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సోమవారం నటి సుమయా రెడ్డి ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ లో పాల్గొని జూబ్లీహిల్స్లో మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..‘స్వచ్ఛమైన ప్రాణవాయువు లభించాలంటే ప్రకృతి బాగుండాలి. అందుకు మొక్కలు నాటాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ బాధ్యతను మనందరికీ గుర్తుచేస్తున్న గొప్ప కార్యక్రమం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ సంతోష్ గారికి కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి’ అని అన్నారు. అనంతరం తుషార్, నిహారిక కొణిదెల, శృతి లకు ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ విసిరారు.