Sai Pallavi | తెలంగాణ ఆడపడుచుగా.. అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నటి సాయిపల్లవికి నమస్తే తెలంగాణ దినపత్రిక కార్టూనిస్ట్ మృత్యుంజయ అదిరిపోయే గిఫ్ట్ను కానుకగా అందించారు. మృత్యుంజయ పెయింటింగ్కు ఆమె ‘ఫిదా’ అయిపోయారు. ఆ పెయింటింగ్ను చూసి మురిసిపోయారు సాయిపల్లవి.
కార్టూనిస్ట్ మృత్యుంజయ.. సాయిపల్లవి ఫోటోను అద్భుతంగా చిత్రీకరించి.. ఆమెకు తన కూతురు అక్షరతో కలిసి అందజేశారు. ఇక తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మృత్యుంజయ రూపొందించిన ఎకోస్ ఆఫ్ లైన్స్ అనే కార్టూన్ బుక్ను సాయిపల్లవికి అందజేశారు. ‘సాయిపల్లవి.. అక్షరాలు నర్తించే కవిత్వానివి నువ్వు’ అంటూ.. ఆ పుస్తకంపై మృత్యుంజయ రాసి శుభాకాంక్షలు తెలిపారు.
రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన విరాటపర్వం సినిమా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లలో ఆమె బిజీగా ఉన్నారు. విరాటపర్వం మూవీ వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కింది.