Prya Anand and Swamy Nithyananda | లీడర్ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన నటి ప్రియా ఆనంద్. ఆ సినిమా తర్వాత సిద్ధార్థ్తో కలిసి 180 రామ్ పోతినేనితో రామరామ కృష్ణకృష్ణ, సినిమాల్లో నటించింది. బాక్సాఫీసు దగ్గర ఈ సినిమాలు ఫర్వాలేదనిపించినప్పటికీ.. ప్రియా ఆనంద్కు మాత్రం అంతగా గుర్తింపు దక్కలేదు. దీంతో కో అంటే కో సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది. కోలీవుడ్ సినిమాలకే పరిమితమైంది. అప్పుడప్పుడు కన్నడ, మలయాళ సినిమాల్లోనూ మెరిసింది. కానీ తెలుగులో మాత్రం ఈమెకు అవకాశాలు రాలేదు. ఇప్పుడు ఇన్నేళ్లకు మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది ప్రియా ఆనంద్. అక్కినేని యంగ్ హీరో సుశాంత్ హీరోగా తెరకెక్కిన మా నీళ్ల ట్యాంక్ వెబ్ సిరీస్తో వస్తుంది. జూలై 15 నుంచి జీ 5 ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్లో పాల్గొన్న ప్రియా ఆనంద్.. స్వామి నిత్యానందపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.
ప్రియా ఆనంద్ చాలా వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా స్వామి నిత్యానంద సూక్తులను పోస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ప్రియా ఆనంద్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. స్వామి నిత్యానందపై పోస్టులు పెట్టడం గురించి టాపిక్ వచ్చింది. నిత్యానంద సూక్తులను సోషల్ మీడియాలో పోస్టు చేయడం వెనుక గల కారణమేంటని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు.. ప్రియా ఆనంద్ షాకింగ్ రిప్లై ఇచ్చింది. తనకు నిత్యానంద అంటే ఎంతో ఇష్టమని.. ఎంతమంది విమర్శించినప్పటికీ కూడా ఆయన్ను చూడటానికి వేలాదిమంది ఆసక్తి చూపిస్తారని తెలిపింది. ఒక్కోసారి ఆయన క్రేజ్ చూస్తే షాకింగ్గా అనిపిస్తుందని పేర్కొంది. అంతటితో ఆగకుండా అన్ని కుదిరితే నిత్యానందను పెండ్లి చేసుకోవాలని ఉందని మనసులో మాట బయటపెట్టింది. ఇక నిత్యానందతో పెండ్లి జరిగితే తన పేరు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉండదని.. ఇద్దరి పేర్లు ఇంచుమించుగా ఒకేలా ఉంటాయని సరదాగా చెప్పుకొచ్చింది. అయితే ఈ సమాధానం సీరియస్గా చెప్పిందా? లేదా క్రేజ్ కోసం చెప్పిందో తెలియదు కానీ.. ప్రియా ఆనంద్ రిప్లై విని చాలామంది షాకవుతున్నారు.
Karthikeya-2 Movie | నిఖిల్ ‘కార్తికేయ-2’ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ కానుందా?