మానవాళికి పచ్చని ప్రకృతిని ప్రసాదించేందుకు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమం ’గ్రీన్ ఇండియా చాలెంజ్’. ఐదో వసంతంలోకి అడుగుపెట్టిన ఈ కార్యక్రమంలో సినీ తారలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మంగళవారం నటి ప్రాంతిక ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో పాల్గొని ప్రశాసన్నగర్ జీహెచ్ఎంసీ పార్క్లో మొక్కలు నాటారు. అనంతరం ప్రాంతిక మాట్లాడుతూ..‘పచ్చదనం, ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీదా ఉందని గుర్తు చేస్తున్న గొప్ప కార్యక్రమం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’. ఇందుకోసం చెట్లను నరికివేత నుంచి కాపాడుకుంటూ మొక్కలను నాటాలి’ అని చెప్పింది.