సీనియర్ కథానాయిక మీనా కుటుంబ సభ్యులంతా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని మీనా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అందరూ జాగ్రత్తగా వుండాలని ఆమె కోరారు. ‘కొత్త సంవత్సరంలో మా ఇంటికి విచ్చేసిన తొలి అతిథి కరోనా. దానికి మా కుటుంబ మంతా నచ్చింది. అయితే సరే దాన్ని మా ఇంట్లో ఉండనివ్వను. మీరంతా కేర్గా వుండండి. బాధ్యతగా వ్యవహరించి కరోనాను అరికట్టండి’అని మీనా కోరారు. మీనా అభిమానులు, సినీ ప్రముఖులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గత సంవత్సరం ‘దృశ్యం-2’ పెద్దన్న చిత్రాల్లో నటించిన మీనా ప్రస్తుతం ‘బ్రో డాడీ’ అనే మలయాళ చిత్రంలో నటిస్తున్నారు.