‘ఈ పాయింట్ని కోన వెంకట్ నాలుగేళ్ల క్రితమే చెప్పారు. ఆ టైమ్లో నేను బిజీ. ఫస్ట్ పార్ట్లో చేసిన ఇతర నటీనటులు కూడా బిజీ. అందుకే కుదర్లేదు. ఇప్పుడు నాతోపాటు అందరికీ కుదిరింది. అందుకే వేగంగా సినిమాను పూర్తి చేసేశాం.’ అని చెప్పుకొచ్చింది కథానాయిక అంజలి. ఆమె ప్రధానపాత్ర పోషించిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది.
ఈ సందర్భంగా అంజలి సోమవారం విలేకరులతో ముచ్చటించింది. ‘ఫస్ట్ పార్ట్ ఎక్కడ ముగిసిందో సీక్వెల్ అక్కడ మొదలవుంది. ఫస్ట్పార్ట్ చూడని వాళ్లకు కూడా ఈ సీక్వెల్ అర్థమవుతుంది. ఇందులోకి పాత పాత్రలతోపాటు కొత్త పాత్రలు కూడా వచ్చి చేరాయి. అలీ, సునీల్, సత్య కూడా ఇందులో భాగం అయ్యారు.’ అని తెలిపింది అంజలి.
దర్శకుడు శివ తుర్లపాటి కొరియోగ్రఫర్ కావడంచేత, షాట్ డివిజన్పై అవగాహన ఉంది కాబట్టి, పూర్తి క్లారిటీతో డైరెక్ట్ చేశారని, వందశాతం ఎఫర్ట్ పెట్టి అద్భుతంగా సినిమాను మలిచారని అంజలి చెప్పింది. పాత్రధారులంతా అద్భుతమైన కామెడీ టైమింగ్తో పొట్టచెక్కలయ్యేలా చేస్తారని, ‘గీతాంజలి’ తరహాలోనే తగినంత హారర్, తగినంత కామెడీతో పాటు సాంకేతికంగా కూడా నెక్ట్స్ లెవల్లో సినిమా ఉంటుందని, ఈ ఉగాదికి అందరినీ కడుపుబ్బా నవ్వించడానికే మా గీతాంజలి మళ్లీ వచ్చిందని అంజలి పేర్కొన్నది. ఈ సినిమా తన యాభయ్యవ చిత్రం కావడంపై ఆమె ఆనందం వ్యక్తం చేసింది.