ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా నేత లోకేష్ నిర్వహిస్తున్న యువగళం కార్యక్రమంలో పాల్గొన్న నటుడు తారకరత్న కొద్దిసేపటికే గుండెపోటుతో సొమ్మసిల్లి పడిపోయారు. ఆయనకు పల్స్ పడిపోవడంతో దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇబ్బందిగానే ఉన్నట్లు సమాచారం. ఆయనకు యాంజియోగ్రామ్ నిర్వహించి, స్టంట్ వేశామని వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం తారకరత్నను బెంగళూరు తరలిస్తామని తెదేపా నాయకులు చెప్పారు.