హృదయాల్ని స్పృశించే అందమైన భావోద్వేగాలతో ‘గోదారి గట్టుపైన’ చిత్రాన్ని తెరకెక్కించామని, ఈ వేసవిలో అందరూ ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా ఇదని అన్నారు చిత్ర కథానాయకుడు సుమంత్ ప్రభాస్. సుభాష్చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకొస్తున్నది. బుధవారం ప్రీరిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.
మానవ విలువలు ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, ఈ సినిమా చూశాక తండ్రీకూతుళ్ల అనుబంధం తాలూకు గాఢత అర్థమవుతుందని, ప్రతీ అమ్మాయి వాళ్ల నాన్నకు ఫోన్చేసి ‘ఐ లవ్ యూ డాడీ’ అని చెబుతుందని సుమంత్ ప్రభాస్ అన్నారు. కూతురిని అమితంగా ప్రేమించే తండ్రి కథ ఇదని దర్శకుడు సుభాష్చంద్ర తెలిపారు. థియేటర్లో చూసి ఫీల్ కావాల్సిన సినిమా ఇదని నిర్మాత అభినవ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.