ముంబై : ప్రముఖ మరాఠీ నటుడు రవీంద్ర బెర్డే (78) బుధవారం తుదిశ్వాస విడిచారు. గత కొన్నేండ్లుగా గొంతు క్యాన్సర్తో బాధపడుతున్న రవీంద్ర బెర్డే (Actor Ravindra Berde) గుండెపోటుతో ముంబైలోని తన నివాసంలో కన్నుమూశారు. బెర్డేకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
సింగం మూవీలోనూ నటించిన రవీంద్ర బెర్డే అనారోగ్య సమస్యలతో తనువు చాలించారని భారత సినీ, టీవీ దర్శకుల అసోసియేషన్ బుధవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. దివంగత నటుడి ఆత్మ శాంతించాలని, ఆయన కుటుంబసభ్యులకు ఈ నష్టం నుంచి కోలుకునే శక్తి ప్రసాదించాలని కోరుతున్నామని పేర్కొంది.
రవీంద్ర బెర్డే దివంగత నటుడు లక్ష్మీకాంత్ బెర్డే సోదరుడు. మరాఠీ రంగస్ధలంలో ప్రముఖడిగా వెలుగొందిన రవీంద్ర బెర్డే పలు సినిమాల్లోనూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నాయక్, సింగం వంటి హిందీ సినిమాల్లోనూ ఆయన నటించారు.
Read More :