Jr. NTR | బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ హీరోగా వచ్చిన ‘యానిమల్'(Animal) మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సందీప్ వంగా (Sandeep Vanga) దర్శకత్వంలో పాన్ ఇండియా వైడ్గా డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా కేవలం 12 రోజుల్లోనే సూమారు రూ.757 కోట్లు సాధించి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత బీ టౌన్తో పాటు సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు ‘త్రిప్తి డిమ్రీ’ (Tripti Dimri). ఈ సినిమాలో ‘త్రిప్తి డిమ్రీ’ ‘జోయా’ అనే పాత్రలో నటించి ప్రశంసలు దక్కించుకుంది. తాజాగా ఐఎండీబీ విడుదల చేసిన మోస్ట్ పాపులర్ హీరోయిన్ల లిస్ట్లోను త్రిప్తి మొదటి స్థానంలో నిలిచింది. ఇక ‘యానిమల్’ సినిమాతో ఇండియా వైడ్ పాపులర్ అయిన ఈ అమ్మడు కోసం ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీ నుంచి భారీ ఆఫర్లు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై త్రిప్తి తాజాగా స్పందించింది.
తనకు సౌత్ ఇండస్ట్రీ నుంచి ఆఫర్లు వచ్చినట్లు వచ్చిన వార్తలపై ఓ ఇంటర్వ్యూలో త్రిప్తి స్పందిస్తూ.. ”నేను ఇప్పటివరకు ఏ సౌత్ సినిమాను ఒప్పుకోలేదు. కానీ సౌత్లోనూ అవకాశాలు రావాలని కోరుకుంటున్నా. ”నాకు జూనియర్ ఎన్టీఆర్ (NTR) అంటే ఇష్టం ఆయనతో కలిసి నటించాలని ఉంది’ అని తెలిపారు. దీంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తండ్రీకొడుకుల సెంటిమెంట్తో రూపొందిన ‘యానిమల్’లో రణ్బీర్కు జంటగా అందాల తార రష్మిక మందన్నా నటించింది. అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి డిమ్రి ప్రధాన పాత్రలు పోషించారు.