హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా శనివారం మొక్కలు నాటారు. షాద్నగర్ వద్దనున్న తన వ్యవసాయ క్షేత్రంలో కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతంగా కొనసాగుతున్నదని, ప్రతి ఒక్కరూ తమ జీవితంలో గుర్తుండి పోయేలా తమ పుట్టిన రోజు, పెళ్లి రోజున మొక్కలు నాటుతూ పర్యావరణానికి మేలు చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేలా ప్రోత్సహిస్తున్న ఎంపీ సంతోష్కుమార్ను అభినందించారు. గ్లోబల్ వార్మింగ్ అరికట్టాలన్నా, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలన్న ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ప్రకాశ్రాజ్ పిలుపునిచ్చారు.