Nitesh Pandey | చిత్ర పరిశ్రమ (Film Industry)లో మరో విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు (Bollywood Actor) నితేశ్ పాండే (50) (Nitesh Pandey) కన్నుమూశారు. మహారాష్ట్ర (Maharshtra)లోని నాసిక్ (Nashik ) సమీపంలోగల ఇగత్పురిలోని ఓ హోటల్ ( Hotel)లో శవమై కనిపించారు. ఇగత్పురిలో షూటింగ్లో నిమిత్తం వెళ్లిన ఆయన అక్కడ హోటల్ రూమ్లో గుండెపోటుకు గురైనట్లు పోలీసులు తెలిపారు. నితేశ్ మృతి విషయం తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు.
1973లో జన్మించిన నితేశ్.. తేజస్ (Tejas) షోతో టీవీ రంగంలోకి అడుగుపెట్టాడు. అస్తిత్వ, ఏక్ ప్రేమ్ కహాని, మంజిలీన్ అపానీ అపాని, సాయా, జస్టజూ, దుర్గేష్ నందిని వంటి పాపులర్ సీరియల్స్లో నటించి పేరు తెచ్చుకున్నాడు. కేవలం టీవీ సీరియల్స్ లోనే కాదు.. పలు చిత్రాల్లోనూ నితేశ్ నటించారు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన ‘ఓం శాంతి ఓం’ (Om Shanti Om) చిత్రంలో సహాయకుడిగా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
Also Read..
Sourav Ganguly | త్రిపుర రాష్ట్ర టూరిజం అంబాసిడర్గా గంగూలీ
Donald Trump | ముదిరిన వివాదం.. ట్రంప్పై కోటి డాలర్లకు మరో పరువు నష్టం దావా వేసిన జీన్ కారోల్
Road Accident | లోయలో పడిన క్రూజర్ వాహనం.. ఆరుగురు మృతి