యాదాద్రి, అక్టోబర్ 19 : ప్రేక్షకుల ముందుకు ఈ నెల 21న రాబోతున్న యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా జిన్నా సక్సెస్ అయితే కుటుంబ సమేతంగా వచ్చి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారికి మొక్కులు తీర్చుకుం టామని సినీ నటుడు మంచు విష్ణు తెలిపారు. బుధవారం ఉదయం ఆ యన రచయిత కోన వెంకట్తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.
పూజలు చేసి సినిమా సక్సెస్ కావాలని మొక్కుకున్నారు. చాలా రోజులుగా మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ట్టు చెప్పారు. 21న ప్రేక్షకుల ముందు కు రాబోయే ‘జిన్నా’ సినిమా మంచి ఆదరణ పొంది గొప్ప విజయాన్ని సాధించడం ఖాయమన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఆదరించాలని కోరారు.