అక్షయ్కుమార్కు భారత పౌరసత్వం బాలీవుడ్ అగ్ర నటుడు అక్షయ్కుమార్ కెనడా పౌరసత్వం మీద గత కొన్నేళ్లుగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. భారతీయ చిత్రసీమలో అగ్ర హీరోల్లో ఒకరిగా కొనసాగుతూ దేశ పౌరసత్వం లేకపోవడంపై ఆయన తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తాను భారతీయ పౌరసత్వాన్ని పొందిన విషయాన్ని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రకటించారు అక్షయ్కుమార్. తన పౌరసత్వానికి సంబంధించిన అధికారిక ధృవీకరణ పత్రాల ఫొటోలను ఆయన షేర్ చేశారు.
‘నా హృదయం, పౌరసత్వం రెండూ హిందుస్థానీ. అందరికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్’ అని అక్షయ్కుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ మారింది. ఎట్టకేలకు అక్షయ్కుమార్ భారత పౌరసత్వ వివాదం ముగిసిపోయిందని ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2019లోనే అక్షయ్కుమార్ భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే కోవిడ్ కారణంగా ఇన్నాళ్లు ఆలస్యమైంది. ఇటీవల విడుదలైన ‘ఓ మై గాడ్-2’ చిత్రంతో అక్షయ్కుమార్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తున్నది.