Akkineni Nagarjuna | తెలంగాణ మంత్రి కొండా సురేఖపై టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున క్రిమినల్ కేసుతో పాటు, పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మరికాసేపట్లో నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు హీరో నాగార్జున. ఈ కేసులో మధ్యాహ్నం తరువాత నాగార్జున వాంగ్మూలాన్ని కోర్టు రికార్డు చేయనుంది. నాగార్జునతో పాటు మిగతా సాక్షుల స్టేట్మెంట్ లను ఈరోజే రికార్డ్ చేయనున్నట్లు సమాచారం.
అసలు ఏం జరిగిందంటే..
అక్కినేని నాగార్జున ఫ్యామిలీపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. టాలీవుడ్ అగ్ర నటి సమంతతో పాటు, అక్కినేని కుటుంబంపై కొండా సురేఖ (Minister Konda Surekha) చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో దూమారం రేపుతున్నాయి.
అయితే కొండా చేసిన వ్యాఖ్యలకు గాను హీరో అక్కినేని నాగార్జున పరువునష్టం దావా వేశారు. తన కుటుంబ పరువుకు భంగం కలిగించారని.. తమ కుంటుంబ సభ్యుల గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యలు చేశారంటూ పిటిషన్ దాఖలు చేశారు. మంత్రి కొండాసురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.