టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో చిరంజీవి (Chiranjeevi) కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య (Acharya) . ఏప్రిల్ 29న వేసవి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఏదో ఒక క్రేజీ అప్డేట్ ఫిలింనగర్ సర్కిల్ లో రౌండప్ చేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతుంది. తాజాగా ఆచార్యకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. ఆచార్య రన్ టైం సుమారు 3 గంటలు ఉండనుందట.
రఫ్ కటింగ్ తర్వాత వచ్చిన అవుట్ పుట్ను ఏం మార్చకుండా లెంగ్తీ రన్ టైంతో సినిమాను విడుదల చేయాలని కొరటాల ప్లాన్ చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. సినిమాలో డెప్త్ ఎక్కువగా ఉంటే ప్రేక్షకులు థియేటర్లలో ఎంజాయ్ చేస్తారని కొరటాల ధీమాగా ఉన్నారని చెప్తున్నారు. దీనిపై ఫైనల్ త్వరలోనే ఫైనల్ డెసిషన్ కూడా తీసుకోనున్నాడట.
ఆచార్యలో కాజల్ అగర్వాల్ పీ మేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. రాంచరణ్ కీ రోల్ చేస్తుండగా..పూజాహెగ్డే అతడికి జోడీగా నటిస్తోంది. మణిశర్మ మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన పాటలకు మంచి స్పందన వస్తోంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి , అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.