శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. కిషోర్ తిరుమల దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. దసరా పర్వదినం సందర్భంగా నాయకానాయికల ఫస్ట్లుక్ను విడుదల చేశారు. పూల తోరణాల మధ్య నిల్చొని చిరునవ్వుల్ని చిందిస్తున్న ఈ జంట కన్నులపండువగా కనిపిస్తున్నది. ‘మహిళా ప్రాధాన్యత చిత్రమిది. ఇంటిల్లిపాది చూసి ఆనందించేలా ఉంటుంది. మగువల ఔన్నత్యాన్ని, కుటుంబ జీవనంలో వారి పాత్రను ఆవిష్కరిస్తూ తెరకెక్కిస్తున్నాం’ అని చిత్రబృందం తెలిపింది. కుష్బూ, రాధిక శరత్కుమార్, ఊర్వశీ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్.