A.r Rehman | ‘ఆర్ఆర్ఆర్’ సంచలనం సృష్టించింది. ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గోల్డ్ అవార్డును ట్రిపుల్ఆర్ సొంతం చేసుకుంది. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ‘నాటు నాటు’ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకుంది. సంగీత దర్శకుడు కీరవాణి ఈ అవార్డును అందుకున్నాడు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా స్వర మాంత్రికుడు ఏ.ఆర్ రెహమాన్ దీనిపై స్పందిస్తూ.. ఆర్ఆర్ఆర్ టీమ్కు విషెస్ చెప్పాడు.
కీరవాణి, రాజమౌళితో పాటు చిత్రయూనిట్ మొత్తానికి భారతీయులందరి తరుపున రెహమాన్ శుభాకాంక్షలు తెలిపాడు. ప్రస్తుతం రెహమాన్ వేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. ఇక గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న తొలి ఆసియా పాట ఇదే అవడం తెలుగు వారికి గర్వపడేలా చేస్తుంది. కీరవాణి స్వర పరిచిన ఈ పాటను రాహుల్ సిప్లీగంజ్, కాల భైరవ ఆలపించిగా.. చంద్రబోస్ సాహిత్యం అందించాడు. ప్రేమ్ రక్షిత్ నృత్యాలు సమకూర్చాడు.
Incredible ..Paradigm shift🔥👍😊👌🏻 Congrats Keeravani Garu 💜from all Indians and your fans! Congrats @ssrajamouli Garu and the whole RRR team! https://t.co/4IoNe1FSLP
— A.R.Rahman (@arrahman) January 11, 2023