Taapsee Pannu | బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్ను ఈ ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. డెన్మార్క్కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో గత తొమ్మిదేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ భామ.. మార్చి 23న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత చాలా రోజులకు సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చింది తాప్సీ. ప్రస్తుతం తాప్సీ నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్లో విహారయాత్రలో ఉండగా.. అక్కడ తన కజీన్స్తో కలిసి పూల తోటలో దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇక ఈ ఫొటోలలో తాప్సీ వైట్ స్వెటర్, పీచ్ కలర్ స్కర్ట్తో ఊయలలో ఊగడంతో పాటు ట్రాక్టర్ పై దిగిన ఫోటోలు ఇన్స్టా వేదికగా పంచుకుంది.
సినిమాల విషయానికి వస్తే.. తాప్సీ ప్రస్తుతం ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా’(Phir Aayi Hasseen Dillruba) అనే చిత్రంలో నటిస్తుంది. 12 ఫెయిల్ నటుడు విక్రాంత్ మాస్సే (Vikrant Massey) హీరోగా నటిస్తుండగా.. జయ్ప్రద్ దేశాయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
Vacation time!💐#TaapseePannu shares snaps from her holiday in Netherlands. pic.twitter.com/GRLSITmbEW
— Filmfare (@filmfare) May 5, 2024