నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా రూపొందుతున్న చిత్రం ‘గుర్రం పాపిరెడ్డి’. డార్క్ కామెడీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మురళీమనోహర్ దర్శకుడు. వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్(బాబీ) నిర్మాతలు. నిర్మాణం తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.
ప్రమోషన్స్లో భాగంగా ఈ సినిమా నుంచి ఓ లిరికల్ సాంగ్ని మేకర్స్ విడుదల చేశారు. ‘ఏదోటి చేయ్ గుర్రం పాపిరెడ్డి..’ అంటూ సాగే ఈ పాటను సురేష్ గంగుల రాయగా, కృష్ణ సౌరభ్ స్వరపరిచారు. లక్ష్మిమేఘన, ఎంసీ చేతన్ ఆలపించారు. హీరో పాత్రను ఉత్తేజపరిచేలా ఈ పాట సాగింది. బ్రహ్మానందం, యోగిబాబు, ప్రభాస్శ్రీను తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అర్జున్ రాజా, సమర్పణ: డా.సంధ్య గోలీ.