8 Vasantalu | టాలీవుడ్ యువ దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి (Phanindra Narsetti) దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘8 వసంతాలు’(8 Vasantalu). దాదాపు 7 సంవత్సరాల తర్వాత మెగాఫోన్ పట్టిన ఈ దర్శకుడు ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మిస్తుండగా.. ఈ సినిమాలో మ్యాడ్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న అనంతిక సనిల్ కుమార్ లీడ్ రోల్లో నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్ను విడుదల చేసిన చిత్రయూనిట్ తాజాగా మరో అప్డేట్ను పంచుకుంది.
ఈ సినిమాను జూన్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త టీజర్ను పంచుకుంది. ఫస్ట్ టీజర్లో కథానాయికను పరిచయం చేసిన టీమ్.. రెండో టీజర్లో హీరో పాత్రను పరిచయం చేసింది. మధురం అనే షార్ట్ ఫిల్మ్తో గుర్తింపు తెచ్చుకున్న రవి తేజ దుగ్గిరాల ఈ సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. ‘ఊటీకి కొత్తగా వచ్చిన తెలుగు రచయిత అతడు. తను పదాలను ప్రేమతో రాస్తే తడిసిన గులాబీ పూలలా ఉంటాయి. అదే కసితో రాస్తే, పిన్ పీకిన గ్రనేడ్లా ఉంటాయి’ అంటూ మొదలైన టీజర్ ప్రేమ కవిత్వంతో పొంగిపోయేలా ఉంది. ‘ప్రేమంటే మనం చేరాల్సిన గమ్యం కాదు.. చేయాల్సిన ప్రయాణం’ అంటూ హీరో చెప్పిన డైలాగ్ అకట్టుకుంది. ప్రస్తుతం వైరల్గా మారిన ఈ టీజర్ను మీరు చూసేయండి.
Read More