పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న క్రేజీ ప్రాజెక్టు రాధేశ్యామ్ (Radhe Shyam). శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. బాహుబలి తర్వాత యూనివర్సల్ రేంజ్లో క్రేజ్ పెంచుకున్న ప్రభాస్తో సినిమా తీయాలంటే మినిమం రూ.300 కోట్ల బడ్జెట్ అయినా ఉండాల్సిందే. రాధేశ్యామ్ కూడా 300కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్నట్టు ఇప్పటివరకున్న సమాచారం. కాగా ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ ఒకటి ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. రాధేశ్యామ్ బడ్జెట్ (Radhe Shyam Budget) 25 శాతం అంటే 75 కోట్లు కేవలం సెట్స్ పై ఖర్చు పెట్టిందట టీం.
రాధాకృష్ణకుమార్ (Radhakrishna kumar) డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీని విజువల్ వండర్గా సిల్వర్ స్క్రీన్పై చూపించబోతున్నట్టు ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ చెబుతున్నాయి. రాధేశ్యామ్ కోసం వేసిన కలర్ఫుల్ సెట్స్ సినిమాకే హైలెట్ నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. యూరప్ బ్యాక్ డ్రాప్లో యూనివర్సల్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలోనికొన్ని సీన్లను ఇటలీలో షూట్ చేశారు. అయితే అదే సమయంలో ఇటలీలో కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో ఇండియాలోనే ఇటలీ లొకేషన్ సెట్ వేశారు.
ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ హైదరాబాద్లో భారీ సెట్టు వేశారు. రాధేశ్యామ్ కోసం మొత్తం 101 సెట్స్ వేశారని ఇన్సైడ్ టాక్. రైలు, రైల్వేస్టేషన్, షిప్, కాఫీ షాప్, హీరోయిన్ ఇల్లు, చాపర్, ఆస్పత్రి ఇలా చాలా వరకు వేసిన సెట్స్ సినిమాకే ప్రధాన హైలెట్గా నిలుస్తాయని చెబుతున్నారు మేకర్స్. సిల్వర్ స్క్రీన్ సెట్స్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో రేపు తెలియనుంది.