ప్రపంచశాంతి కోసం థాయ్లాండ్కు చెందిన 60 మంది బౌద్ధ బిక్షువులు కర్ణాటక రాష్ట్రం స్వర్ణభూమి నుంచి తెలంగాణలోని నాగార్జున సాగర్ వరకు పాదయాత్ర చేపట్టారు. మంగళవారం ఈ యాత్ర హైదరాబాద్లోకి ప్రవేశించింది. ఇందు లో ‘కింగ్ బుద్ధ’ చిత్రాన్ని రూపొందిస్తున్న దర్శకుడు సత్యారెడ్డి పాల్గొన్నారు.
ప్రపంచశాంతిని కాంక్షిస్తూ ‘కింగ్ బుద్ధ’ చిత్రాన్ని హాలీవుడ్లో నిర్మిస్తున్నామని, ఇప్పటివరకు పది దేశాల్లో చిత్రీకరణ పూర్తయిందని, ఇంకా 15 బౌద్ధ దేశాల్లో షూటింగ్ బ్యాలెన్స్గా ఉందని సత్యారెడ్డి తెలిపారు. ప్రపంచంలోని వందదేశాల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని, బుద్ధుని జీవితం, పంచశీల సిద్ధాంతాలను తెలియజేస్తూ ప్రతిష్టాత్మంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని సత్యారెడ్డి తెలిపారు.