న్యూఢిల్లీ, మే 11: ‘వర్క్ ఫ్రం హోంతో విసిగిపోయారా? అయితే ఐఆర్సీటీసీ మీ కోసమే కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. ‘వర్క్ ఫ్రం హోటల్’ పేరిట ప్రత్యేక ప్యాకేజీని ప్రారంభించింది. కేరళలోని హోటల్ రూమ్స్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో కూర్చుని ఆఫీసు పని చేసుకోవచ్చు. ట్రిపుల్ ఆక్యుపెన్సీ కింద ఐదు రోజులకు ఒక్కొక్కరికి రూ.10,126 నుంచి ప్యాకేజీలు ఉన్నాయి. ఈ ప్యాకేజీలో డిసిన్ఫెక్టెడ్ గదులు, మూడుపూటలా భోజనం, రెండుసార్లు కాఫీ/టీ, వై-ఫై, పార్కింగ్, ప్రయాణ బీమా వంటి సదుపాయాలను ఐఆర్సీటీసీ కల్పిస్తుంది.